NZB: యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వర్ని ఎస్సై వంశీ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. శనివారం మోస్రా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, కార్యదర్శితో ఆయన సమావేశమయ్యారు. మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా కఠినంగా శిక్ష తప్పదని సూచించారు.