WGL: రాయపర్తి మండలం మైలారం సబ్స్టేషన్ పరిధిలోని వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి సహకరించాలని సబ్ ఇంజనీర్ సయ్యద్ ముజాఫర్ అహ్మద్ కోరారు. ఆదివారం మైలారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక బిల్లుల సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.