AP: CM చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ భేటీకి ఆరుగురు మంత్రులు హాజరుకాలేకపోయారు. అనారోగ్యంతో హోమంత్రి అనిత, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, TG భరత్ ఈ సమావేశానికి రాలేదు. రేపటి జనసేన ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లలో బిజీగా ఉండి Dy.CM పవన్, మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశంలో పాల్గొనలేదు. మంత్రి ఫరూక్ తన భార్య సంవత్సరీకం కారణంగా రాలేకపోయినట్లు సమాచారమిచ్చారు.