AP: రాష్ట్రంలో పలు చోట్ల గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొంది. ఈ క్రమంలోనే విజయవాడ గ్యాస్ వినియోగదారులకు బుక్ చేయకపోయినా చేసినట్లుగా మెసేజులు వచ్చాయి. దీంతో వారంతా సిలిండర్ల కోసం ఏజెన్సీలకు క్యూకట్టారు. అయితే మెసేజులతో తమకు సంబంధం లేదని, సిలిండర్లు ఇవ్వలేమని ఏజెన్సీలు చెప్పాయి. ఏజెన్సీలే గ్యాస్ బుక్ చేసి సిలిండర్లను బ్లాక్లో అమ్ముకుంటున్నాయని కస్టమర్లు ఆరోపిస్తున్నారు.