హైదరాబాద్: 28°C
వార్తలు

ఏనుగుల సంచారం.. అప్రమత్తంగా ఉండాలి

Advertisement

AP: మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. సిబిల్లి పెద్దవలస, కాముడువలసలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈనెల 13న సాలూరు నుంచి ఒడిశాకు ఏనుగులు వెళ్లాయి. మళ్లీ ఒడిశా నుంచి సాలూరు మండలానికి ఏనుగులు చేరాయి. కాముడువలసలో పామాయిల్‌ తోట, మోటార్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Advertisement