AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవం సందర్భంగా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించినట్లు ఆలయ అధికారులు, అర్చకులు తెలిపారు. స్వర్ణరథంపై స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు జరిపించారు. ఆలయ ప్రధాన పురవీధుల్లో కళాకారుల సంప్రదాయ నృత్యాలు, మంగళ వాయిద్యాల సందడితో కనులపండువగా రథోత్సవం ముందుకు కదిలింది.
భక్తి
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం
Advertisement
Advertisement
Advertisement


