MDK: మనోహరాబాద్ మండలం పాలాట గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి టీకాల శిబిరాన్ని సర్పంచ్ సాయికుమార్ ప్రారంభించారు. పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రావణి మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.