KDP: మైదుకూరులో రేపటి నుంచి ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కార్యాలయంలో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యాలయంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, ప్రజలు ఇకపై ప్రొద్దుటూరుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.