W.G: ఆకివీడు మండలం పెదకాపవరంలో గ్రామంలో గురువారం ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. గ్రామంలోని మంచినీటి చెరువు, ఫిల్టర్ బెడ్లు, సంపులు, మైక్రో యూనిట్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర సలహాదారుడు ప్రభాకర్ రావు, బ్రౌసు సంస్థ సభ్యులు డాక్టర్ సుధాకర్ శ్రీధర్, డీఎల్పీవో దోసిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.