TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దీక్ష విరమించారు. కవితతో పాటు విశారదన్ మహారాజ్ దీక్ష విరమించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కవిత ఖమ్మంలో సోమవారం రాత్రి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.