ADB: నార్నూర్ మండలంలోని ఖైర్థత్వ గ్రామానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి శనివారం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా అడవి పందులు అకస్మాత్తుగా దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సచిన్, ప్రదీప్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.