KMR: దోమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేస్తామని పట్టణానికి చెందిన వ్యాపారి పప్ప విజయ్ కుమార్ అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం రూ.కోటి విరాళం అందజేశారు. ఆడబ్బులతో చేపట్టే పనులకు విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ కాగా వాటిని పాఠశాలహెచ్ఎంకు బుధవారం అందజేశారు. తాము చదువుకున్న పాఠశాల అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.