విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చిత్తూరు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. కరెంటోల్ల జనబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారని ఆయన చెప్పారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 52 సమస్యలు, LT లైన్ల పరంగా 35, సర్వీసు లైన్ పరంగా 8, కలిపి మొత్తం 95 సమస్యలను గుర్తించారన్నారు.