VZM: కొత్తవలస నుంచి విజయనగరం మూడో లైన్, నాల్గో లైన్ విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజును ఆయన కార్యాలయంలో మంగళవారం గ్రామస్థులు కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పెంటాజీ, త్రినాథ్, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.