కొందరు బరువు తగ్గడానికి మధ్యాహ్న భోజనం లేదా డిన్నర్ మానేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గకపోగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ సేపు ఆకలితో ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. శరీరం కొవ్వును బర్న్ చేయడానికి బదులుగా నిల్వ చేస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా బరువు తగ్గిన మళ్లీ వేగంగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు.