NRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్వ మండలంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంఈవో రాంరెడ్డి ఆధ్వర్యంలో తపస్ సంఘం సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ వారు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో TPUS మండలాధ్యక్షుడు వసంత్ కుమార్, సెక్రటరీ రాజు పాల్గొన్నారు.