కృష్ణా: చల్లపల్లి(M) నారాయణరావునగర్లో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక కడుపునొప్పితో స్కూలుకు వెళ్లకపోవడం, స్నానం చేయలేదని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై బాత్రూంలో చున్నీతో ఉరేసుకుంది. ఇది గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.