SRPT: దేశంలో సెక్యులరిజానికి కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలిచేది తమ పార్టీయేననీ ఆయన అన్నారు.