MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ మహేందర్కు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. రైస్ మిల్లు వ్యవస్థ నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోందని, దానిని కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.