KMM: రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సవరణలు వ్యతిరేకిస్తూ సోమవారం సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరైనదికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.