BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జె. భవాని శంకర్ తెలిపారు. కొండ కింద గల వ్రత మండపం హాల్ నంబర్ 2లో ఉదయం 7 గంటలకు హుండీల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.