KMR: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని ఎం.అకిత జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈనెల 17న కేరళలోని కొట్టాయం ఎంజీయూ వేదికగా జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో అకిత తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున పాల్గొననుంది.