HNK: ఐనవోలు మండల కేంద్రంలోని గురుమిళ్ళపల్లి గ్రామానికి చెందిన బేతి మల్లేశం-అరుణ దంపతుల కుమారుడు బేతి విక్రమ్ యూపీఎస్సీ ఫలితాల్లో 472వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలిసి విక్రమ్ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామానికి గౌరవం తీసుకువచ్చిన విక్రమ్ మరింత ఉన్నత స్థానాలను చేరుకోవాలని కోరారు.