గుంటూరు: రాజధాని అమరావతిలోని తుళ్లూరు ప్రాంతంలో నిర్మిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం పనులను మంత్రి సవిత అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ నెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా స్మృతి వనంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.