SDPT: సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరి గ్రామంలో శనివారం రైతులు కాళేశ్వరం నీటితో గ్రామ చెరువును నింపాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు రోడ్డుపై బైటాయించి తమ పంటలు ఎండిపోతున్నాయని, తమపై దయ చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులోకి నీటి విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ధర్నాను ఉధృతం చేస్తూ, తరువాత కలెక్టరేట్ ముందు ధర్నా చేయనున్నట్టు తెలిపారు.