JGL: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధూప దీప నైవేద్య అర్చకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర అర్చక సమాఖ్య కన్వీనర్ నాగరాజు మహేంద్ర చార్య కోరారు. కరీంనగర్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియను ఇవాళ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమెకు వివరించి, జ్ఞాపికను బహూకరించారు.