హైదరాబాద్: 28°C
క్రైమ్

డివైడర్‌ను ఢీకొట్టి ద్విచక్ర వాహనదారుడు మృతి

Advertisement

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కొండపి మండలం కే.ఉప్పలపాడు గ్రామానికి చెందిన శివారెడ్డిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Advertisement

Advertisement