TPT: తిరుపతి గ్రేడ్-1 శాఖ గ్రంథాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, బీడీసీ నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలను అభివృద్ధి చేసి పుస్తక పఠనం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో గ్రంథాలయ కార్యదర్శి RVRSS శర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు.