గుంటూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రామాలు, వార్డుల్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను శనివారం సాయంత్రం నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లు, ఎంఫీడీవోలు స్వర్ణ కార్యాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుని సర్వే ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.