PPM: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని AITUC జిల్లా కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం పార్వతీపురంలోని స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితుల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు హాజరవుతారని పేర్కొన్నారు.