ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో భారత్ టీ బ్రేక్ సమయానికి 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 99 రన్స్ చేసింది. దీప్తి శర్మ(4), జెమీమా(15) క్రీజులో ఉండగా.. అంతకుముందు స్మృతి(4), షఫాలీ(35), ప్రతిక(18), కెప్టెన్ హర్మన్(19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ 2, డార్సీ, ల్యూసీ చెరో వికెట్ తీశారు.