విజయనగరం మండలంలోని కేఎల్ పురం నుంచి ద్వారపూడి వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారింది. జిల్లా కేంద్రం నుంచి ఇటుగా నిత్యం రాకపోకలు సాగుతాయి. పలుచోట్ల భారీ మలుపులున్నాయి. హెచ్చరిక బోర్డులు గానీ, వీధి దీపాలు గానీ లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు