AP: ప్రభుత్వం తనపై కుట్రపూరితంగానే దాడి చేసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ పనిగట్టుకుని దాడి చేయించిందని, పార్టీలకతీతంగా కాపులు తనకు సంఘీభావం తెలిపారన్నారు. ఈ ఘటనతో కాపు కమ్యూనిటీలో ఒకరకమైన భావన ఏర్పడిందన్నారు. అదేంటో రాబోయే రోజుల్లో చూస్తారని పేర్కొన్నారు. తాను అనని మాటలను కూడా రిమాండ్ రిపోర్టులో పెట్టారని, చంద్రబాబుకు తెలియకుండా జరిగాయా అని ప్రశ్నించారు.