NZB: కమ్మర్ పల్లి మండలంలోని కోన సముందర్ గ్రామంలో గురువారం గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో రెండు గొర్రెలు మృతి చెందగా, ఏడు గొర్రెలకు తీవ్ర గాయాలైనట్లు బాధితులు మల్లేష్ తెలిపారు. కుక్కల దాడి వల్ల సుమారు రూ.50వేల నుంచి 70 వేల వరకు నష్టము వాటిలిందని బాధితుడు మల్లేష్ వాపోయాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.