అనంతపురంలో కూటమి నేతల అవినీతిపై విచారణకు సిద్ధమా అని మేయర్ మహమ్మద్ వసీం సవాల్ విసిరారు. గురువారం కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, అదనపు ట్రాక్టర్లు ఉన్నా చెత్త సేకరణ జరగడం లేదని విమర్శించారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో కూటమి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.