కర్నూలు : కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న జూనియర్ సహాయకులు, టైపిస్టులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం నలుగురు ఉద్యోగులను సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించినట్లు ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఎర్రబోతుల పాపిరెడ్డి వెల్లడించారు.