SKLM: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మంత్రి శాసనమండలిలో మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని అన్నారు. రైతులకు సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.