NZB: చందూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్ పథకం క్రింద మంజూరైన వ్యవసాయ యంత్రాంలను సర్పంచ్ మద్దూరి మాధవ రెడ్డి అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు .