CTR: జిల్లాలో పరీక్షల భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్తూరు-2 టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. నగరంలోని టెలిఫోన్ కాలనీలో ఉన్న రజియా టెన్త్ క్లాస్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. త్వరలో టెన్త్ క్లాస్ పరీక్షల భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.