NLG: అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను మిర్యాలగూడ గ్రామీణ పోలీసులు బుధవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం..ఆలగడప టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నేరేడుచర్ల వైపు నుంచి మిర్యాలగూడ వైపు ఎలాంటి పత్రాలు లేకుండా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.