విశాఖలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ఔట్గేట్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. మండుటెండలో రెండు గంటల పాటు కార్యకర్తలు బైఠాయించారు.