కృష్ణా: పెడన మండలం నేలకొండపల్లి నుండి లంకలాగంట వల్లే రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చేలా శ్రీకారం చుట్టారని తెలిపారు. రానున్న రోజుల్లో నూతన రోడ్లతో పాటు, రోడ్ల మరమ్మతు పనులు చేపడతామని స్పష్టం చేశారు.