సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి ఎస్.సవితను పలువురు సందర్శకులు, కూటమి నాయకులు కలిశారు. తమ ప్రాంతాల్లోని పలు సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. బాధితుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.