NZB: ధర్పల్లిలో మున్నూరు కాపు చెలిమెల సట్టం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మూడవ వార్షికోత్సవం నేడు ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, కల్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.