GNTR: చేబ్రోలు మండలం శలపాడులో నేడు, రేపు శ్రీ నాంచారమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం భారీ అన్నదానంతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.