నారాయణపేట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద వివిధ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు మంగళవారం వేలంపాట నిర్వహించినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలకు నిర్వహించిన వేలంపాటలో రూ.29 వేలకు గాను, ఓ వ్యక్తి వేలం ద్వారా రూ. 68,020 వేలకు సొంతం చేసుకున్నారని సీఐ చెప్పారు. బహిరంగ వేలంపాటలో మొత్తం 20 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు.