సోషల్ మీడియాపై నటుడు తనికెళ్ల భరణి అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై అవాస్తవాలు రాస్తున్నారని మండిపడ్డారు. తాను అన్ని మతాలను, వర్గాలను గౌరవిస్తాని పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ కించపరచలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ కొటేషన్లు సృష్టించడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.