JGL: పెగడపల్లి మండలం నరసింహునిపేట గ్రామపంచాయతీ భవనానికి నూతన శోభ సంతరించుకుంది. నర్సింహునిపేట గ్రామ పంచాయతీని జాతీయస్థాయి అవార్డుకు నామినేట్ చేసినందున సర్పంచ్ రాజమణి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, అధికారుల సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పంచాయతీ భవనానికి కొత్తరంగు వేయడంతో పాటు భవనం ముందు వివిధరకాల చెట్లు, పచ్చని గడ్డి ఏర్పాటు చేశారు.