VZM: ఇరాన్ – ఇజ్రాయేల్, అమెరికా యుద్ధం జరగడంతో గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులతో విజయనగరం MP అప్పలనాయుడు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విజయనగరంలోని తన కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాల్ మాట్లాడిన ఎంపీ కేంద్రం సొంత గ్రామాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యుద్ధంతో మందులు, ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.