అన్నమయ్య: బోరెడ్డిగారిపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పలువురు మంత్రిని పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.